బాధ్యతలు స్వీకరించిన అడిషనల్​ కలెక్టర్లు

బాధ్యతలు స్వీకరించిన అడిషనల్​ కలెక్టర్లు

సంగారెడ్డి టౌన్, వెలుగు : సంగారెడ్డి అడిషనల్​కలెక్టర్(లోకల్​బాడీస్) గా  బి. చంద్రశేఖర్,  అడిషన్​ కలెక్టర్ (రెవెన్యూ) గా ఆర్​డీ మాధురి బుధవారం కలెక్టరేట్ లోని తమ చాంబర్లలో  పదవి బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా డీఆర్ ఓ  నగేశ్, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.  నిజామాబాద్ అడిషనల్​ కలెక్టర్(రెవెన్యూ) గా కొనసాగిన బి. చంద్రశేఖర్ ను  సంగారెడ్డి జిల్లా అడిషనల్​కలెక్టర్ (లోకల్​ బాడీస్​)గా  నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి అడిషనల్​కలెక్టర్(రెవెన్యూ) గా కొనసాగిన జి . వీరారెడ్డిని సీసీఎల్ఏ  కార్యాలయానికి బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో జగిత్యాల ఆర్డీఓ గా పనిచేస్తున్న ఆర్ డీ మాధురిని నియమించింది. సంగారెడ్డి డీఎస్పీగా రమేశ్​కుమార్ సైతం బుధవారం 
బాధ్యతలు స్వీకరించారు.

మెదక్​ అడిషనల్​కలెక్టర్​బదిలీ

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ (రెవెన్యూ) రమేశ్​ హైదరాబాద్​ స్పెషల్​ గ్రేడ్​ డిప్యూటీ కలెక్టర్​గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు వెయిటింగ్​లో ఉన్న వెంకటేశ్వర్లును మెదక్​ అడిషనల్​ కలెక్టర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మెదక్​ జిల్లా రెవెన్యూ అధికారిణి (డీఆర్​వో)గా పద్మశ్రీ నియమితులయ్యారు.

సిద్దిపేట ఏసీపీగా సురేందర్ రెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట ఏసీపీగా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీపీ ఎన్. శ్వేత ను కలిసి మొక్కను అందజేశారు. కాగా సురేందర్ రెడ్డి 1998 లో ఎస్సైగా పోలీస్ డిపార్ట్​మెంట్​లో ప్రవేశించి ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేశారు. 2010లో సీఐ గా ప్రమోషన్ పొంది  ఉమ్మడి మెదక్ జిల్లా, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలో పనిచేశారు.