సీఎం చెప్పినా అమలవ్వట్లే!

సీఎం చెప్పినా అమలవ్వట్లే!

    టికెట్​తీసుకోని ప్రయాణికుడు

    టిమ్ డ్రైవర్‌‌‌‌కు చార్జీ మెమో

హుజూరాబాద్, వెలుగు: ‘ఆర్టీసీ బస్సులో టికెట్​ తీసుకోవాల్సిన బాధ్యత ప్రయాణికుడిపైనే ఉంటుంది. టికెట్​తీసుకోకుండా ప్రయాణికులు దొరికితే ఇకపై కండక్టర్లపై చర్యలు తీసుకోం’ అంటూ సీఎం కేసీఆర్ ​డిసెంబర్​1న ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పేర్కొన్నారు. కానీ సీఎం మాటలు అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. హుజూరాబాద్​ టు జమ్మికుంటకు టీమ్​కండక్టర్ ​కమ్ ​డ్రైవర్​గా తోకల సమ్మిరెడ్డి బుధవారం డ్యూటీలో ఉన్నారు. హుజూరాబాద్​ నుంచి జమ్మికుంటకు ప్రయాణికులతో వెళ్తుండగా మధ్యలో ఆర్టీసీ అధికారులు తనిఖీ చేశారు. ఒకరు టికెట్​లేకుండా దొరకడంతో తోకల సమ్మిరెడ్డికి ఆర్టీసీ తనిఖీ అధికారులు చార్జి మెమో జారీ చేశారు. ఈ సంఘటనపై డిపో మేనేజర్​రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కేసీఆర్​సమావేశంలో చెప్పినప్పటికీ అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు అందలేదని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి