చాట్ జీపీటీ యూజర్ల కోసం కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. యూజర్లు తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా కొలీగ్స్తో కలిసి ఒకే గ్రూప్లో మాట్లాడుకునే విధంగా ఈ ఫీచర్ సాయపడుతుంది. ఈ గ్రూప్ చాట్లకు యూజర్ల పర్సనల్ చాట్లతో లింక్ ఉండదు. పర్సనల్ చాట్ మెమొరీని గ్రూప్లోని ఇతరులతో షేర్ చేసుకోదు. ఈ ఫీచర్ ప్రస్తుతం జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్లలో ఫ్రీ, గో, ప్లస్, ప్రో యూజర్లకు పైలట్ దశలో డెస్క్టాప్, మొబైల్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంది.
గ్రూప్లో చాట్జీపీటీ కూడా ఒక మెంబర్లా ఉంటుంది. కానీ, చర్చల్లో పార్టిసిపేట్ చేయదు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి లేదా ఐడియాల కోసం సాయం చేస్తుంది. అలాగే ఎమోజీలు, ప్రొఫైల్ బేస్డ్ రియాక్షన్లతో స్పందించగలదు. చాట్జీపీటీ యూజర్లు ‘పీపుల్’ లోగోను ట్యాప్ చేయడం ద్వారా గ్రూప్ చాట్ను స్టార్ట్ చేయొచ్చు. లింక్ ద్వారా 20 మంది వరకు వ్యక్తులను ఇన్వైట్ చేయొచ్చు. ఇందులో కంట్రోల్ ఫీచర్లు, పేరెంటల్ సేఫ్గార్డ్స్ కూడా ఉన్నాయి. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని యూజర్ల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా గ్రూప్చాట్లను మెరుగుపరిచి ఆ తర్వాత రిలీజ్ చేయనున్నట్లు చాట్జీపీటీ టీం తెలిపింది.
