కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్తోపాటు, సీహెచ్సీల్లో పని చేసే సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో హాస్పిటల్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
కనీస జీతం రూ.26వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. 5న వైద్య విధాన పరిషత్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. ఏఐటీయూసీ స్టేట్ లీడర్ దశరథ్, జిల్లా సెక్రటరీ పి.బాల్రాజు, నాయకులు శ్రీనివాస్, రఫీక్, లక్ష్మీ, సాజీయా పాల్గొన్నారు.
