బై: స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి మధ్య విభేదాలు ఏర్పడ్డాయా? ఈ సీజన్లో మిగతా మ్యాచ్లకు జడేజా దూరం కావడానికి గాయం ఒక్కటే కారణం కాదా? తమ మాట వినని సురేశ్ రైనా మాదిరిగా జడేజాను కూడా సీఎస్కే వదులుకుంటుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వీటికి ఔననే సమాధానం వస్తోంది. జడేజా, సీఎస్కే పరస్పరం తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను అన్ఫాలో చేసుకోవడం వీటికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ సీజన్ కు ముందు ధోనీ (12 కోట్లు) కంటే ఎక్కువ ధర రూ.16 కోట్లు వెచ్చించి జడేజాను రిటైన్ చేసుకున్న సీఎస్కే అతనికే కెప్టెన్సీ ఇచ్చింది. కానీ జడ్డూ సారథ్యంలో జట్టు పెర్ఫామెన్స్ ఏమాత్రం బాగాలేదని, అతడి ఆటతీరు కూడా దెబ్బతిన్నదని మళ్లీ ధోనీకే పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీలో బెంగళూరుతో ఆడిన మ్యాచ్లో జడేజా గాయపడ్డాడు. ఆ తర్వాత తను లీగ్ మొత్తానికి దూరమయ్యాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. ఈలోపు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను అన్ఫాలో చేసుకోవడం చూస్తుంటే ఫ్రాంచైజీ, జడేజాకు మధ్య మనస్పర్థలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. కానీ, చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
మరిన్ని వార్తల కోసం
ప్లే ఆఫ్ నుంచి చెన్నై ఔట్