
- దళితరత్న అవార్డుల ప్రదానంలో ఎమ్మెల్యే వివేక్ పిలుపు
గండిపేట, వెలుగు: దళితులు ఐక్యతతో సామాజికాభివృద్ధి, రాజ్యాధికారం దిశగా ముందడుగు వేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా తెలంగాణ మాలల సమితి(టీఎంఎస్)కు చెందిన రాష్ట్ర నేతలు రావుల చందర్, జెట్టి విజయ్కుమార్, దారా రాజు, పత్తి శ్రావణ్, చామంతుల స్వామి దళితరత్న–2025 అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ వారిని అభినందించారు.
సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో టీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు బరిగెల వెంకటస్వామి, కార్యనిర్వహక కార్యదర్శి బిట్ల శ్రీనివాస్రాజు, ఉపాధ్యక్షులు మన్నెం వీరాస్వామి, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి గజ్జల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.