తిరుమల శ్రీవారి సేవలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి

తిరుమల శ్రీవారి సేవలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోపిడిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎం  రేవంత్ రెడ్డికి సూచించడం జరిగిందని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. నేడు వేకువజామున స్వామి వారి సుప్రభాత సేవలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.. 

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమయిందని, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు.. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాంమని, మిషన్ భగీరథ పెయిల్ అయిందని, ఎక్కడా మంచి నీరు రావడం లేదన్నారు. 

కాలేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగిందని, కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామన్నారు..పది సంవత్సరాలలో ప్రజా ధనం దుర్వినియోగంపై వైట్ పేపర్ తీసుకురావాల్సి ఉందని, అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారని, ధరణి పోర్టల్ తో కల్వకుంట్ల కుటుంబం భూ దందాకు పాల్పడిందని ఆరోపించారు .