రైతుల డిమాండ్ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలె : వివేక్ వెంకటస్వామి

   రైతుల డిమాండ్ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలె :  వివేక్ వెంకటస్వామి

చెన్నూరు మండలం అస్నాద్ లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు, లారీల్లో లోడింగ్ తీరు పై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు వడ్లను తూర్పాల పట్టీ  నాణ్యమైన ధాన్యాన్ని  మిల్లర్లకు అందించేందుకు సహకరించాలని చెప్పారు.  వచ్చే సీజన్ వరకు చెన్నూరు నియోజకవర్గం పరిధిలో ధాన్యం స్టోరేజ్ కేంద్రం అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.  ఓత్కులపల్లి లో రెండు వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని..   రైతుల డిమాండ్ మేరకు మరో  కొనుగోలు కేంద్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  గ్రామంలో రోడ్లు, బోర్ల ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు. 

Also read :Pune Porsche Accident Case: బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్