వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి : వివేక్​ వెంకటస్వామి

వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి : వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్​,వెలుగు : పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల హైటెక్​ సిటీలోని ఎమ్మెల్యే నివాసంలో  బీఆర్​ఎస్​  లీడర్లు, కార్యకర్తలు    వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు.  

క్యాతనపల్లి మున్సిపాలిటీ 12 వార్డు బీఆర్​ఎస్​ కౌన్సిలర్​బొద్దున రమ్య-ప్రేమ్​సాగర్​, మందమర్రి సహకార సంఘం చైర్మన్​ ఎస్​.ప్రభాకర్​రావు, ఏఐటీయూసీ పిట్​ సెక్రటరీ బత్తుల రాజ్​కుమార్​తో పాటు పలువురు మెడికల్​ డిపార్ట్​మెంట్​ ఉద్యోగులు, జైపూర్​ మండలం ఇందారం పంచాయతీ వార్డు సభ్యులు వైద్య శ్రీధర్, అల్లాడి రామకృష్ణ వైద్య నరసయ్య, వల్లాల భాను, వడల శ్రీనివాస్, పొన్నగంటి శ్రీనివాస్, కారంగుల రంజిత్, నల్లవెల్లి రాజేష్   ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్  కండువా కప్పుకున్నారు. 

నూతన వధువరులను ఆశీర్వదించిన వివేక్

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భీమా గార్డెన్స్​లో జరిగిన రాజేశ్​-ప్రత్యూష  పెండ్లికి , మంచిర్యాల పద్మనాయక ఫంక్షన్​ హాల్​లో వెలుగు స్టాప్​ రిపోర్టర్​ చౌదరి సురేశ్-శ్రీలత దంపతులు కూతురు జ్యోతిర్మయి నూతన వస్ర్తాలంకరణ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను, జ్యోతిర్మయిని ఆశీర్వదించారు.

వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం .. 

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా బుధవారం మందమర్రి పట్టణంలోని 24 వార్డుల్లోని 42 బూత్​ల్లో ఇంటింటి ప్రచారం  నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలను వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్​ నోముల ఉపేందర్​గౌడ్​, సీనియర్ లీడర్​ సొతుకు సుదర్శన్​,పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండ భాస్కర్​, సెక్రటరీ బత్తుల రమేశ్​, ఎస్సీ సెల్​ ప్రెసిడెంట్​ నెర్వెట్ల శ్రీనివాస్​, మహిళ విభాగం ప్రెసిడెంట్​ గడ్డం రజనీ, మైనార్టీ ప్రెసిడెంట్​ జమీల్, ఎన్​ఎస్​యూఐ స్టేట్​ లీడర్​ అర్జున్​ మహంతో​ తదితరులు పాల్గొన్నారు.