ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

సికింద్రాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్​ను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.

 మంగళవారం ఆసుపత్రికి వెళ్లిన వివేక్.. లక్ష్మణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్​కుమార్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో నిమగ్నం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్​నుంచి ధర్మపురి వెళ్తుండగా జగిత్యాల జిల్లా వెల్గటూర్​ మండలం కొత్తపేట సమీపంలో కారు బోల్తాపడి గాయపడిన సంగతి తెలిసిందే.