ఆప్ నేత సంజయ్ సింగ్
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, బీజేపీ నేత చేతన్ చౌహాన్ రీసెంట్గా కరోనా బారిన పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నిర్లక్ష్యమే కారణమంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్లో కరోనా పరిస్థితిపై యోగి ఆదిత్యనాథ్ను తప్పుబడుతూ సంజయ్ విమర్శలకు దిగారు. ‘నమూనా పేరుతో పిలవడం ద్వారా యూపీ ప్రజలను యోగి ఆదిత్యనాథ్ అవమానించారు. దీనికి ప్రజలకు ఆయన సారీ చెప్పాల్సిందే. రాష్ట్రం మొత్తం కరోనా భయంతో వణుకుతోంది. దివంగత మంత్రి చేతన్ చౌహాన్ మర్డర్కు వారి నిర్లక్ష్యమే కారణం. అందుకే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తా’ అని సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు.
बेहद दुःख की बात है कि योगी जी ने कल उत्तर प्रदेश की जनता को “नमूना” कहा और जनता का अपमान किया। योगी जी को जनता से माफ़ी माँगनी चाहिए।
आज पूरे उत्तर प्रदेश में करोना का क़हर है।
PGI में सरकार के मंत्री स्व.चेतन चौहान की लापरवाहीपूर्ण हत्त्या हुई है इस मामले में FIR करूँगा। pic.twitter.com/BVlZ1KjWB3— Sanjay Singh AAP (@SanjayAzadSln) August 23, 2020