భద్రాచలం, వెలుగు : మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడవి హిడ్మా స్వగ్రామం, చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువ్వర్తిని సోమవారం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా హిడ్మా తల్లిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమెతో కలిసి భోజనం చేశారు. హిడ్మా లొంగిపోయేలా నచ్చజెప్పాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. మావోయిస్ట్ రహిత భారత్గా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
