నా కూతురు ఏడుస్తూ బయటకు పరిగెత్తింది.. పార్లమెంట్లో యానిమల్ రచ్చ

నా కూతురు  ఏడుస్తూ బయటకు పరిగెత్తింది.. పార్లమెంట్లో యానిమల్ రచ్చ

యానిమల్ మూవీపై ఛత్తీస్‌గఢ్ ఎంపీ రంజీత్ రంజన్(Ranjeeth Ranjan) సంచనల కామెంట్స్ చేశారు. యానిమల్(Animal) సినిమాకు తన కూతురు ఏడుస్తూ బయటకు వచ్చిందని చెప్తూ బ్యాడ్ సినిమాకు ఉదాహరణగా చూపించారు రంజీత్ రంజన్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక యానిమల్ సినిమా గడించి రంజీత్ రంజన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. నా కూతురు తన ఫ్రెండ్స్ కలిసి యానిమల్ సినిమాకు వెళ్లింది. సినిమా మధ్యలోనే ఆమె ఏడుస్తూ బయటికి వచ్చేసింది. సినిమాలో హింస, మహిళలపై వేధింపులు సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలాంటివి చూపించడం నాకు నచ్చదు. కబీర్ సింగ్ సినిమాలో కూడా తన భార్యను, సమాజాన్ని, తోటి మనుషులతో చాలా అగ్రెసీవ్ బిహేవ్ చేస్తాడు. పైగా అలాంటి పాత్రలే కరెక్ట్ అన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది కచ్చితంగా ఆలోచనను రేకెత్తించే అంశమే అవుతుంది. ఇలాంటి సినిమాలు ఇంటర్ చదివే పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. అలాంటి వారిని రోల్ మోడల్‌ గా భావిస్తున్నారు.. అంటూ  షాకింగ్ కామెంట్స్ చేశారు రంజీత్ రంజన్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. బోల్డ్ అండ్ వైలెంట్ మూవీగా వచ్చిన యానిమల్ సినిమాపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే.. మరి కొందరు విమర్శిస్తున్నారు. సినిమాలో వైలెన్స్ అండ్ బోల్డ్ కంటెంట్ ఎక్కువయింది అని కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికి ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. దాంతో ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే రూ.550 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.