అక్టోబర్​ 28న చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

అక్టోబర్​ 28న చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని  అక్టోబర్​ 28వ తేదీ శనివారం రోజు మూసివేయనున్నారు. ఎనిమిది గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తామని చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు ప్రకటించారు. 

అక్టోబర్​29వ తేదీన తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం ఉండగా గ్రహణ సమయానికి 8 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.

తిరిగి అక్టోబర్29వ తేదీన ఆలయాన్ని శుభ్రం చేసి తెల్లవారుజామున 3.15 గంటలకు తెరవనున్నారు. ఉదయం 7 నుంచి భక్తులను అనుమతించనున్నారు.

ఇటు తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేయనున్నారు.