చాంగ్జ్హౌ: చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా షట్లర్లు నిరాశపర్చారు. మంగళవారం ఆడిన ప్రతి ఒక్కరూ ఓటమి పాలయ్యారు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్.ఎస్. ప్రణయ్ 12–21, 21–13, 18–21తో ఎంగ్ జీ యంగ్ (మలేసియా) చేతిలో, లక్ష్యసేన్ 21–23, 21–16, 9–21తో అండెర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో, ప్రియాన్షు రజావత్ 13–21, 24–26తో షిసెర్ హీరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
విమెన్స్ డబుల్స్లో పుల్లెల గాయత్రి– ట్రిసా జాలీ 18–21, 11–21తో చెన్ క్వింగ్ చెన్–జియా యి ఫ్యాన్ (చైనా) చేతిలో, మెన్స్ డబుల్స్లో ఎం.ఆర్ అర్జున్–ధ్రువ్ కపిల 21–23, 19–21తో కిచిరో మట్సు–టెకుచి (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించారు.