భారత్‌ నుంచి తమ దేశీయులను తరలించేందుకు సిద్ధమైన చైనా

భారత్‌ నుంచి తమ దేశీయులను తరలించేందుకు సిద్ధమైన చైనా

భారత్ దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని తమ దేశీయులను స్వదేశానికి తరలించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన చైనా విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించాలని నిర్ణయించుకుంది. స్వదేశానికి రావాలనుకుంటున్న వారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. అయితే రావాలనుకున్న వారు క్వారంటైన్, ఇతర వైద్య పరమైన ఏర్పాట్లకు అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో చిక్కుకున్న చైనీయులను కూడా తరలించాలని జిన్‌పింగ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అత్యధికంగా కరోనా వ్యాపిస్తున్న దేశాల లిస్టులో ఇండియా టాప్-10లోకి చేరింది.