బీజింగ్: చైనాలోని జిన్జియాంగ్లో మానవ హక్కుల పరిస్థితిపై యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నిర్వహించిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉండడంపై చైనా సైలెంట్గా ఉంది. అయితే వీగర్ ముస్లింలపై తాను అనుసరిస్తున్న విధానాన్ని చైనా సమర్థించుకుంది. టెర్రరిజం, వేర్పాటువాదాన్ని అడ్డుకునేందుకే వీగర్ ముస్లింల విషయంలో కఠినంగా ఉండాల్సి వస్తోందని పేర్కొంది.
జిన్జియాంగ్ లో ప్రజల హక్కులను కాపాడాలని, ప్రజలను గౌరవించాలని ఇండియా పిలుపునిచ్చిన తర్వాత చైనా ఆవిధంగా స్పందించింది. శనివారం మీడియాతో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడారు. జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం లేదని తెలిపారు.