
బీజింగ్: చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ మంగళవారం బీజింగ్లోని ఓ ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని స్టేట్ టెలివిజన్ ప్రసారం చేసింది. ఉజ్బెకిస్తాన్ పర్యటన తర్వాత తొలిసారి గా ఆయన జనంలోకి వచ్చారు. దీంతో చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, జిన్పింగ్ను హౌస్ అరెస్టు చేశారని జరుగుతున్న ప్రచారానికి పుల్స్టాప్ పడింది. జిన్పింగ్ పాలనపై దేశంలో వ్యతిరేకత పెరుగుతున్నా తన స్థానాన్ని కొనసాగించుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. కరోనా కంట్రోల్కు తీసుకున్న చర్యలతో ప్రెసిడెంట్పై జనం ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు తైవాన్తో ఉద్రిక్తత లపై పలు దేశాలు చైనాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వచ్చే నెల 16న జరగబోయే చైనీస్ కమ్యూని స్టు పార్టీ మీటింగ్లో మూడోసారి కూడా పదవిలో కొనసాగించేందుకు జిన్పింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.