అభిమానుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్.. ఒకే వేదికపై చిరు, బాలయ్య

అభిమానుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్.. ఒకే వేదికపై చిరు, బాలయ్య

నందమూరి(Nandamuri)  అండ్ మెగా ఫ్యాన్స్(Maga fans) కు గుడ్ న్యూస్. ఒకే వేదికపై చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) కనిపించనున్నారు. ఇందుకోసం భారీ ప్లాన్ చేస్తోంది ఆహా(Aha) టీమ్. ఈ న్యూస్ తెలుసుకున్న ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ఆన్స్టాపబుల్(unstoppable ) టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఇండియాలో అప్పటివరకు ఉన్న టాక్ షోలు అన్నింటినీ బీట్ చేసిన హైయెస్ట్ టీఆర్ఫీని నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ తల షో. అయితే ఇప్పటివరకు రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. తాజాగా సీజన్ 3 కోసం సిద్ధమవుతోంది. రాయితీ సీజన్ మొదటి ఎపిసోడ్ ను మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ తో స్టార్ చేయాలని చూస్తున్నారట. నిజానికి లాస్ట్ సీజన్ కె చిరంజీవి వస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ రాలేదు. ఆయన స్థానంలో పవన కళ్యాణ్ ను తీసుకొచ్చారు మేకర్స్. 

కానీ ఈసారి మాత్రం తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి వస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఏ న్యూస్ తెలుసుకున్న మ్యూచువల్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. నిజానికి ఈ కాంబో కోసం ఫ్యాన్స్ కూడా చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ కు రికార్డ్ లెవల్లో టీఆర్పీ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.