Vishwambhara: అంత రిస్క్ అవసరమా? కేర్ఫుల్ అన్నయ్య అంటున్న ఫ్యాన్స్

Vishwambhara: అంత రిస్క్ అవసరమా? కేర్ఫుల్ అన్నయ్య అంటున్న ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చెన్నై చిన్నది త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకింగ్ కూడా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. 

ఇక తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగాస్టార్. ఇటీవల ఆయన ఓకే ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాం. ముచ్చింతల్ లో వేసిన భారీ ఆంజినేయ స్వామి విగ్రహం వద్ద ఈ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నాం. ఈ యాక్షన్ సీన్ చేయడానికి నాకు డూప్ ని తీసుకొచ్చారు. ఎందుకు అని అడిగితే.. భారీ యాక్షన్ సీన్ అని చెప్పారు. ఆ సీన్ గురించి విన్నాక పర్లేదు నేనే చేస్తాను అని చెప్పాను.

కానీ డైరెక్టర్ వాళ్లు రిస్క్ అని వద్దన్నారు. కానీ, నేను వినలేదు. మన ఫ్యాన్స్ కోసం, వాళ్ళని అలరించడానికి కష్టమైన భరించాలి. నాలో ఆ శక్తి ఉంది.. అందుకే రిస్క్ తీసుకుంటాను.. అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్.. అంత రిస్క్ అవసరమా అన్నయ్య.. జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో.. ఈ ఏజ్ లో ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయడమే గ్రేట్.. అలాంటిది డూప్స్ లేకుండా భారీ యాక్షన్ సీన్స్ కూడా చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.. దట్ ఈజ్ మెగాస్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.