బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెగాభిమానుల్లో జోష్ని నింపుతున్నారు చిరంజీవి. ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్టతో చిరు 157వ చిత్రాన్ని చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని ఆదివారం అనౌన్స్ చేశారు. అందరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉండబోతోందన్నారు మేకర్స్. ‘మెగా ఫిల్మ్.. మెగా స్టార్ట్. త్వరలోనే ప్రేక్షకులను సినిమాటిక్ అడ్వెంచర్కు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాం’ అని దర్శకుడు వశిష్ట ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా చిరంజీవితో పాటు నిర్మాతలు వంశీ, ప్రమోద్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడుతో కలిసున్న ఫొటోను షేర్ చేశాడు. ఫాంటసీ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందించనున్నట్టు ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇందులో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలు కలిసి ఉన్న.. నక్షత్ర ఆకారపు చక్రం, దానిమధ్య త్రిశూలం ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఈ నెల 15న నెట్ఫ్లిక్స్లో విడుదలవుతోందని ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.