'రంగమార్తాండ' నుంచి క్రేజీ అప్‌డేట్

'రంగమార్తాండ' నుంచి క్రేజీ అప్‌డేట్

టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'రంగమార్తాండ'. తాజాగా ఈ సినిమా అప్‌డేట్ ను కృష్ణవంశీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్‌ చిరంజీవి షాయరీ (కవితాఝరి) అందించబోతున్నాడని ప్రకటించాడు. "స్నేహితులు, శ్రేయోభిలాషులకు హాయ్‌.. చాలా కాలంగా ఉన్న ఎదురుచూపులకు శుభం పడనుంది. గర్వంగా సమర్పిస్తున్నా.. నా సినిమా రంగమార్తాండ కోసం అన్నయ్య షాయరీ.. మీరంతా ఇష్టపడతారని ఆశిస్తున్నాను" అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు..అంతేకాదు దీనికి సంబంధించిన చిరు కవితాఝరి పలుకుతున్న స్టిల్‌ను కూడా షేర్ చేశాడు. నేనొక నటుడిని అంటూ సాగే షాయరీని డిసెంబర్‌ 21న ఉదయం 11 : 07 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు కృష్ణవంశీ ప్రకటించాడు. 

ఈ సినిమాలో నటుడు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హౌస్‌ఫుల్‌ మూవీస్‌–రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత కృష్ణవంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.