అయోధ్యలో చిరంజీవి.. అనీల్ అంబానీతో మాటామంతీ

అయోధ్యలో చిరంజీవి.. అనీల్ అంబానీతో మాటామంతీ

అయోధ్య(Ayodhya)లో రామమందిరం(Ram Mandhir) ప్రారంభోత్సవానికి మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi) కుటుంబం హాజరుకానున్నారు. దాదాపు 500 ఏళ్లనాటి భారతీయుల కల నెరవేరుతున్న వేళ.. ‍రాంమచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్‌  ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. మధ్యాహ్నం జరుగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇక మెగా ఫ్యామిలీ అయోధ్యకి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. వాటిలో ఒక ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫొటోలో ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ రాజ్యసభ సభ్యులు అనిల్ అంబానీతో మాట్లాడుతూ కనిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ ఫొటోలో వారితో పాటు రామ్ చరణ్ కూడా కనిపించారు. ఈ ముగ్గరు కలిసి కాసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.