వరుణ్-లావణ్య పెళ్లి వేడుకలకు మెగా ఫ్యామిలీ నుండి ఆమె దూరం

వరుణ్-లావణ్య పెళ్లి వేడుకలకు మెగా ఫ్యామిలీ నుండి ఆమె దూరం

మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej)- లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)ల పెళ్ళికి సర్వం సిద్ధమైంది. ఇటలీలో నవంబర్ 1న వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ ఇటలీ చేరుకున్నారు. కాబోయే కొత్త జంట వరుణ్, లావణ్య శుక్రవారం(అక్టోబర్27) ఇటలీకి వెళ్లారు. దీనికి సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

అయితే.. కొణిదెల వారింట జరుగనున్న ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీకి చెందిన ముఖ్యమైన వ్యక్తి దూరంగా ఉంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు చిరంజీవి తల్లి అంజనాదేవి. ఆమెకు ఆరోగ్యం బాగా లేనందున, ఈ సమయంలో జర్నీ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించడంతో ఆమె ఈ పెళ్లికి దూరంగా ఉండనున్నారని సమాచారం. అయితే.. ఆమె ఇంటినుండే వరుణ్-లావణ్య పెళ్లిని చూడటానికి అన్ని ఏర్పాట్లు చేశారట. ఇక నవంబర్ 1న పెళ్లి జరగనుండగా.. నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ గా రెసెప్షన్ జరుగనుంది.