
పరువు హత్యల నేపధ్యంలో తెలుగులో వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పరువు. నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు కీ రోల్స్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను సిద్దార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి సంయుక్తంగా తెరకెక్కించారు. గ్లోడ్ బాక్స్ ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన ఈ సిరీస్ జూన్ 14 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ నుండి కూడా ఈ సిరీస్ కు పాజిటీవ్ టాక్ వచ్చింది.
Congratulations #Paruvu team on the huge success?.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2024
Proud of you @sushkonidela for creating this groundbreaking Telugu OTT content
and my dear brother @NagaBabuOffl
for a brilliant performance.
ఒక చక్కటి plan తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి…
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరీస్ ను మెగాస్టార్ చిరంజీవి చూశారట. అనంతరం పరువు టీమ్ పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఓ చక్కటి ప్లాన్తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అనే అంశం ఎగ్జైటింగ్గా ఉందన్నారు మెగాస్టార్. తెలుగు ఓటీటీలో ఇంత అద్భుతమైన వెబ్ సిరీస్ అందించిన నిర్మాత సుష్మిత కొణిదెలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నా సోదరుడు నాగబాబు కూడా అద్బుతంగా నటించారని.. రాసుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.