రీసెంట్గా ‘ఆచార్య’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి క్రేజీ లైనప్తో యంగ్ హీరోలకు పోటీనిస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఐదారు చిత్రాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్టుని ఓకే చేశారు. ఎయిటీస్, నైంటీస్లో అనేక సినిమాల్లో జంటగా నటించి మెప్పించిన చిరంజీవి, రాధిక కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే దీనికి రాధిక శరత్కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని రాధిక నిన్న అఫీషియల్గా అనౌన్స్ చేశారు. తమ బ్యానర్ రాడాన్ కోసం ఓ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు చిరంజీవికి థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కింగ్ ఆఫ్ మాస్తో బ్లాక్ బస్టర్ తీసేందుకు చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నానని ట్వీట్ చేశారామె. రాడాన్ ప్రొడక్షన్ బ్యానర్లో తమిళంలో పలు సీరియళ్లు, సినిమాలు, వెబ్ సిరీసులు నిర్మించారు రాధిక. త్వరలోనే తెలుగులో ఓ భారీ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారట. ఆ సినిమా చిరంజీవితోనే తీయాలనేది ఆమె కోరిక అని, ఇది కచ్చితంగా క్రేజీ కాంబో అవుతుందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్తో ‘భోళా శంకర్’ సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాబీ, వెంకీ కుడుముల డైరెక్షన్లోనూ చిరుకి కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కంప్లీట్ అయ్యాకే రాధికతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారా, వీటికంటే ముందే మొదలుపెడతారో చూడాలి.