అల్లుతో నాది గురుశిష్యుల అనుబంధం

అల్లుతో నాది గురుశిష్యుల అనుబంధం

ప్రముఖ సినీ నటుడు, దివంగత అల్లు రామలింగయ్య విగ్రహాన్ని రాజమండ్రిలో చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య హోమియో ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ నటుడిగా తనకు జన్మనిచ్చింది రాజమండ్రి అని చెప్పారు. తాను నటించిన రెండు, మూడు సినిమాలు రాజమండ్రి చుట్టుపక్కల షూటింగులు జరుపుకున్నాయని తెలిపారు. 'మన ఊరి పాండవులు' సినిమా షూటింగ్ సందర్భంగా అల్లు రామలింగయ్యతో తనకు తొలిసారి పరిచయం ఏర్పడిందని తెలిపారు.  తమ మధ్య గురుశిష్యుల అనుబంధం ఉందని తెలిపారు.

వానాకాల చదువులు చదివిన రామలింగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని..అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఎంతో కష్టపడేవారని చిరంజీవి తెలిపారు. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే... మరోవైపు హోమియోపై పరీక్షలు రాసి సర్టిఫికెట్ పొందారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులంతా హోమియో మందులనే వాడతామని తెలిపారు. హోమియోలో మంచి మందులు ఉన్నాయని చెప్పారు.