చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇప్పుడు ట్రైలర్ టైమ్ వచ్చేసిందంటూ న్యూఇయర్ విషెస్తో చిరంజీవి కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో స్టైలిష్ లుక్తో మెగాస్టార్ మెస్మరైజ్ చేస్తున్నారు. స్తంభాన్ని పట్టుకుని ఫొటోకి పోజు ఇస్తున్న చిరంజీవిని కిందనుంచి సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్ ఫొటోలు తీస్తున్నారు.
ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చిరంజీవిని చూస్తుంటే.. ఇరవై ఏళ్ల క్రితం సినిమాల్లో ఆయనను చూసినట్లుగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఇందులోని ఐదో సాంగ్తో పాటు ట్రైలర్ను కొన్ని రోజుల్లో విడుదల చేస్తామన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.