చిట్యాలలో హైవేపై పోలీసులు తనిఖీలు..కబెళాకు తరలిస్తున్న 27 గోవుల పట్టివేత

చిట్యాలలో హైవేపై పోలీసులు తనిఖీలు..కబెళాకు తరలిస్తున్న 27 గోవుల  పట్టివేత

నల్లగొండ జిల్లాలో కబేళాకు తరలిస్తు్న్న గోవులను పట్టుకున్నారు పోలీసులు. నల్లగొండ జిల్లా చిట్యాల  శివారులో 65 జాతీయ రహదారిపై తనఖీలు చేసిన పోలీసులు రెండు డీసీఎంలలో తరలిస్తున్న  గోవులను గుర్తించారు.  

ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు  ఈ గోవులను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు డీసీఎంలలో 27 గోవులను హైదరాబాద్ లోని కబేళాలకు తరలిస్తున్నారు.  గోవులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న చిట్యాల పోలీసులు.. గోవులను  గోశాలకు తరలించారు.