కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్కు అరుదైన గౌరవం దక్కింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ... అభిమానులను అలరించే ఈ నటుడి ఖాతాలో ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ స్టార్ హీరోకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందజేసింది. రెండు రోజుల క్రితం దుబాయ్ వెళ్లిన విక్రమ్కు ఘనంగా స్వాగతం పలికిన యూఏఈ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక వీసా అందజేసింది. కాగా ఈ విషయాన్ని ప్రముఖ టాలీవుడ్ నటి పూర్ణ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. కాగా వివిధ రంగాల్లో రాణిస్తూ... విశేష సేవా కార్యక్రమాలు చేస్తోన్న సెలబ్రిటీలకు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందిస్తూ ఉంటుంది.
2019 నుంచి ప్రదానం చేస్తున్న ఈ వీసాలను ఇంతకుముందు ప్రణీత, కాజల్ అగర్వాల్, మీనా, ఆండ్రియా, త్రిష, అమలాపాల్, కొణిదెల ఉపాసన, షారుఖ్ ఖాన్తో పాటు తదితరులు అందుకున్నారు. తాజాగా ఈ కోవలోనే విక్రమ్కు పదేళ్ల కాల పరిమితితో ఈ వీసా అందజేసింది. నటుడు విక్రమ్కి గోల్డెన్ వీసా అందించడంలో గౌరవం, ప్రత్యేకత ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదృష్టంగా భావిస్తున్నాను’ అని పూర్ణ అన్నారు.. కాగా ఇందులో ఆమె భర్త షానిద్ ఆసీఫ్ చేతుల మీదుగా విక్రమ్ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అయితే పూర్ణ భర్త చొరవతోనే విక్రమ్కు గోల్డెన్ వీసా వచ్చినట్లు తెలుస్తోంది. షానిద్ ఆసీఫ్ అలీ యూఏఈలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.