తెలుగు ఆడియన్స్ తో నాది ప్రత్యేకమైన అనుబంధం

తెలుగు ఆడియన్స్ తో నాది ప్రత్యేకమైన అనుబంధం

తెలుగు ఆడియన్స్ కు తన ఫర్ఫార్మెన్స్ తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని తమిళ హీరో చియాన్ విక్రమ్ అన్నారు. ఆయన ప్రస్తుతం 'కోబ్రా' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్ట్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా హీరో విక్రమ్ మీడియాతో మాట్లాడారు.. ఈ సినిమాలో తనది చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అని.. ఒక్కొక్క మేనరిజమ్స్ చాలా ఇష్టపడి చేశానన్నారు. హీరోయిన్ శ్రీనిధికి, నాకు ఇందులో మంచి రిలేషన్ ఉంటుంది అన్నారు. అలాగే ఈ చిత్రంలో మృణాళిని, మీనాక్షి ఇద్దరు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు చేశారని తెలపారు. ఇది ఇంగ్లీష్ సినిమాలాగా ఉంటూ.. ఒక ఎమోషనల్ డ్రామాగా ఉంటుందని చెప్పారు.

ట్రైలర్ చూసి ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని విక్రమ్ వెల్లడించారు. ఇది యూనివర్సల్ సినిమా.. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో తను 9 క్యారెక్టర్స్ లో నటించానని తెలిపారు. తనకు మాథ్స్ రాదు అన్న వాళ్ళకి రా రా ఇప్పుడు మాథ్స్ చేసి చూపిస్తానని ఈ మూవీలో చెపుతాను అన్నారు. సినిమాలలో తనకు ప్రత్యేకంగా ఇలాంటి పాత్రే చెయ్యాలనే రూల్ లేదని.. తన మనస్సుకు నచ్చితే ఆ పాత్ర కోసం ఎంత కష్టానైనా భరిస్తానని విక్రమ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తనకు మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయన్నారు. ఇక బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ గురించి తనకేమి తెలియదని విక్రమ్ స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం తన హెల్త్ పై వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. తన ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు. అయితే తన హెల్త్ పై హిందీ లో కొన్ని మిమ్స్ చూశానిని.. ఆ తరువాత 5 రోజులు ఆప్పత్రిలో ఉన్నానంటూ చమత్కరించారు.