శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు: శేఖర్ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్

శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు: శేఖర్ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్

 

సినీ పరిశ్రమల్లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి.తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.శేఖర్ మాస్టర్ అన్న భార్య దుర్గ పది రోజుల క్రితం మరణించినట్లు తెలిసింది.

కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న దుర్గ పది రోజుల క్రితం కన్నుమూశారు. మంగళవారం (ఏప్రిల్ 16న) ఆమె దశదిన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో తన వదిన మృతి చెందిన విషయాన్ని తలుచుకుంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 

"మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాము వదిన, ఇన్నాళ్లు ఇంత బాధని భరించి ఎంతో బలంగా నిలబడ్డావు.అలాగే ఎన్నోసార్లు నాకెంతో ధైర్యాన్ని ఇస్తూ..ఎప్పుడూ పాజిటివ్ మైండ్ తో ఎలా ఉండాలో నువ్వే నేర్పించావు, నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను వదిన.ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా మంచి స్థానంలో ఉన్నామని ఆశిస్తున్నాను.నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు వదిన" అంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అలాగే శేఖర్ మాస్టర్ కూతురు సాహితి కూడా సోషల్ మీడియా వేదికగా మిస్ యూ పెద్దమ్మ అన్ని ఎమోషనల్ పోస్ట్ చేసింది.