బంగారం చోరీ కేసులో నలుగురు మహిళలు అరెస్ట్‌

బంగారం చోరీ కేసులో నలుగురు మహిళలు అరెస్ట్‌

మెదక్​ టౌన్​, వెలుగు : బంగారు దుకాణంలో నగలు చోరీ చేసిన కేసులో నలుగురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్​ తెలిపారు. సోమవారం మెదక్ పీఎస్‌లో వివరాలు వెల్లడించారు.  ఈనెల 9న పట్టణంలోని మెహతాబ్​ జువెల్లరీ దుకాణంలోకి నలుగురు మహిళలు వెళ్లి యజమాని మహ్మద్​ షకీల్​అహ్మద్‌ను​ మాటల్లో పెట్టి ముప్పై గ్రాముల బిస్కెట్​ బంగారం, నాలుగు జతల కమ్మలను దోచుకెళ్లారు. సీసీ టీవీలో గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ALSO READ:తెలంగాణ దేశానికి అన్నపూర్ణ రైతుల శ్రేయస్సు కోసమే కేసీఆర్ తపన: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

వాళ్లు మళ్లీ దుకాణానికి రాగా యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన టౌన్​ ఎస్సై లింగం, సిబ్బందితో కలిసి రాందాస్​ చౌరస్తాలో నలుగురిని అరెస్టు చేసి, నగలుస్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారు ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నానికి చెందిన బాలసాని వెంకటరామవ్వ, బొజ్జాని నాగేంద్రమ్మ, బొజ్జగాని ధీనమ్మ, నల్లబోతుల వెంకటమ్మగా గుర్తించామని చెప్పారు.  కేసు చేధించిన ఎస్సై లింగం, కానిస్టేబుళ్లు సాయిబాబాగౌడ్​, శివరాజ్​గౌడ్​, గంగరాజు, రవి, రాజులను సీఐ అభినందించారు.