
హైదరాబాద్, వెలుగు: లింగభేదాన్ని తగ్గించడంపై సీఐఐ ఐడబ్ల్యూఎన్ తెలంగాణ శుక్రవారం లీడర్షిప్ కాన్క్లేవ్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో 350 మంది పాల్గొన్నారు. పాలసీ, గవర్నెన్స్లో , డిజైన్ అండ్ ఇన్నోవేషన్ సెగ్మెంట్లో మహిళల పాత్ర, వర్క్ ప్లేస్లో డిజిటల్ వాడకం వంటి అంశాలపై ఎక్స్పర్ట్లు మాట్లాడారు.
ఈ కాన్క్లేవ్లో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జో స్కౌల్జ్ ప్రారంభించారు. సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ సాయి ప్రసాద్, చైర్ ఉమెన్ శ్రీవిద్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.