తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే పౌరసత్వ చట్టం(సీసీఏ)ను అమలు కాకుండా చూస్తానని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. అసోంలో ప్రతిపక్ష శాసనసభ్యులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీసీఏను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని, ముసాయిదాను తెలివితక్కువ తనంతో రూపొందించడమే ఇందుకు కారణామని ఆయన అన్నారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ను కారణంగా చెప్పి సీసీఏను అమలు చేయలేదని, ఇప్పుడు కూడా దాన్ని అమలు చేయలేకపోతోందని విమర్శించారు. అసోంలో పౌరసత్వం అనేది కీలక విషయమన్న యశ్వంత్.. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది బయటి శక్తి వల్ల కాదని, అధికారంలో ఉన్నవారి వల్లేనని ఆరోపించారు. రాజ్యంగాన్ని కాపాడుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. తాను రాష్ట్రపతి భవన్లో ఉంటే సీసీఏను అమలు కాకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక కోసం సారూప్యత కలిగిన పార్టీల మద్దతు కోరేందుకు యశ్వంత్ సిన్హా అస్సాంలో ఒక రోజు పర్యటించారు. కాగా ఈ ఎన్నికల్లో ఎన్డీయే బలపరిచిన ద్రౌపది ముర్ముతో యశ్వంత్ సిన్హా బరిలోకి దిగుతున్నారు. జున్ 21న ఫలితాలు రానుండగా, రాష్ట్రపతిగా ఎన్నికైన వారు జులై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పౌరసత్వ చట్టం అమలు కాకుండా చూస్తా
- దేశం
- July 13, 2022
లేటెస్ట్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్బాడీ లభ్యం
- Vada Pav Girl: వడా పావ్ గర్ల్ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
Most Read News
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..