
- సీఐటీయూ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సిగాచీ పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం ప్రకటించిన కోటి పరిహారం ఇంత వరకు అందలేదని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఘటన జరిగి వంద రోజులు అవుతున్నా పరిహారం ఇవ్వలేదని.. వెంటనే చెల్లించాలంటూ మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కార్మిక శాఖ కార్యాలయం మందు సీఐటీయూ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
అనంతరం జాయింట్ లేబర్ కమిషనర్కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించి ఇప్పటివరకు రూ. 25 లక్షలు మాత్రమే బాధిత కుటుంబాలకు అందజేశారని విమర్శించారు. గాయపడిన క్షతగాత్రులకు పూర్తి పరిహారం ఇవ్వాలని, కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.