![డబుల్బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆందోళన](https://static.v6velugu.com/uploads/2023/07/CITU-leaders-Collectorate-demanding-the-construction-of-double-bed-houses_n1gJmkKw2h.jpg)
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో అర్హులైన ప్రతీఒక్కరికి డబుల్బెడ్ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సోమవారం సీపీఎం, సీఐటీయూ లీడర్లు కలెక్టరేట్ఎదుట ఆందోళన నిర్వహించారు. వందలాది కార్యకర్తలు నినాదాలు చేస్తూ కలెక్టరేట్లో దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
Also Read : తిర్యాణిలో తాగునీటి కష్టాలు
కలెక్టర్ను కలవాలని కోరగా నలుగురిని మాత్రమే అనుమతించారు. సీఐటీయూ కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. పేదలకు 125 గజాల స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకోవడానికి
రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.