ఖైరతాబాద్ వెలుగు: మే లో బ్రెజిల్లో జరిగే డెఫ్ ఒలింపిక్స్ కు సిటీకి చెందిన టెన్నిస్ ప్లేయర్ భవాని కేడియా ఎంపికైంది. సోమవారం ఎర్రమంజిల్లోని సిద్ధార్థ టవర్స్ లో కోచ్ నెల్లూరు కిరణ్, టెన్నిస్ప్లేయర్ నైనా జైస్వాల్ మీడియాకు వివరాలు తెలిపారు. భవాని సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతుందని, చిన్నప్పటి నుంచి టెన్నిస్అంటే ఆమెకు ఇష్టమని పేర్కొన్నారు. దేశానికి గోల్డ్ మెడల్ తేవడమే లక్ష్యంగా భవాని కృషి చేస్తున్నట్టు ఆమె పేరెంట్స్ పేర్కొన్నారు.