లైవ్ స్ట్రీమింగ్పై సీజేఐదే నిర్ణయం
జ్యుడీషియల్ ఆర్డర్కు సుప్రీం నో
న్యూఢిల్లీ: జాతీయ, రాజ్యాంగ పరమైన ప్రాధాన్యం ఉన్న కేసులను లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్న 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంపై సీజేఐ నిర్ణయం తీసు కుంటారని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టంచేసింది. అడ్మినిస్ట్రేషన్పై సుప్రీంకోర్టుకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఈ విషయంలో సీజేఐనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
లైవ్ స్ట్రీమింగ్పై జ్యుడీషియల్ ఆర్డర్ జారీచేసేందుకు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్ నిరాకరించింది. ఈ విషయంలో సీజేఐ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి నిర్ణయం తీసుకోవడమే సరైనదని పేర్కొంది. ఏఎస్జీ మాధ వి దివాన్.. 2018 నాటి తీర్పు అమ లు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైం దని బెంచ్కు తెలియజేశారు.