అసెంబ్లీ ముందు CLP, PCC నేతల నిరసన

అసెంబ్లీ ముందు CLP, PCC నేతల నిరసన

హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరసనకు దిగారు. CLP నేత మల్లు భట్టి విక్రమార్క్, PCC  చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, ఇతర కాంగ్రెస్ నాయకులు మౌన దీక్షకు కూర్చున్నారు. నోటికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని రోడ్డుపై కూర్చున్నారు.

CLPని విలీనం చేయడంపై సీఎల్పీ, పీసీసీ నేతలు ఆందోళనకు దిగారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని… అధికార పార్టీ తీరును తప్పుపడుతున్నారు. సీఎల్పీ ఆఫీస్ లో భేటీ అయిన నాయకులు.. నిరసనకు దిగాలని నిర్ణయించారు.