V6 News

గోవా అగ్నిప్రమాదం తర్వాత థాయ్‎లాండ్‎కు పరారైన క్లబ్ ఓనర్లు

గోవా అగ్నిప్రమాదం తర్వాత థాయ్‎లాండ్‎కు పరారైన క్లబ్ ఓనర్లు

పణజి: గోవాలో అగ్నిప్రమాదం జరిగి 25 మంది చనిపోయిన అర్పోరా నైట్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌ యజమానులు లూథ్రా సోదరులకు చెందిన మరో క్లబ్‎ను ప్రభుత్వం కూల్చేసింది. వాగటోర్ బీచ్‌‌‌‌‌‌‌‌లోని రోమియో లేన్ క్లబ్‎ను మంగళవారం మధ్యాహ్నం అధికారులు బుల్‌‌‌‌‌‌‌‌డోజర్‌‌‌‌‌‌‌‌తో నేలమట్టం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. లూథ్రా సోదరులు వారికున్న రాజకీయ సంబంధాలు, ఉన్నతాధికారులతో సాన్నిహిత్యంతో వీటిని అక్రమంగా నిర్మించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్లబ్‎ను ప్రభుత్వ భూమి కబ్జా చేసి నిర్మించారని, ఫైర్ సేఫ్టీ పర్మిషన్, నిర్మాణ అనుమతులు కూడా లేవని అధికారులు ప్రకటించారు. 

సోమవారం లూథ్రా బ్రదర్స్‎కు చెందిన అస్సాగావ్‌‌‌‌‌‌‌‌లోని ఒక ఆస్తిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. నైట్​క్లబ్‎లో అగ్నిప్రమాదం ఘటన తర్వాత గోవా ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు 25 మంది మృతికి కారణమైన నైట్​క్లబ్​అగ్నిప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే దాని ఓనర్లు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌కు పరారయ్యారు. దీంతో వీరిపై ఇంటర్‌‌‌‌‌‌‌‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయింది.