తాడ్వాయి/సదాశివనగర్/వర్ని/బోధన్ : ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వాలీబాల్పోటీలను ఎంపీడీవో సాజిత్ అలీ, సదాశివనగర్ మండల స్థాయి ఖోఖో పోటీలను సర్పంచ్ ఎడ్ల నర్సింహులు, హెచ్ఎం దుబ్బాక శేఖర్, వర్ని మండలం ఎస్ఎన్పురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్,అథ్లెటిక్స్ పోటీలను ఎంపీడీవో వెంకటేశ్వర్లు , బోధన్ మండలం కల్దుర్కిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్,అథ్లెటిక్స్ పోటీలను ఎంఈవో నాగయ్య క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్,అథ్లెటిక్స్ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులను అందజేశారు.
