
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, శాట్స్ నిర్వహించిన సీఎం కప్ తొలి ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్లోని వివిధ స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆయా జిల్లాల క్రీడాకారులు సత్తా చాటారు. జింఖానా గ్రౌండ్లో జరిగిన ఖో ఖో పురుషుల ఫైనల్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలవగా, మేడ్చల్ టీమ్ రన్నరప్గా నిలిచింది. మహిళల విభాగంలో యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ విన్నర్, రన్నరప్ ట్రోఫీలు గెలిచాయి. హ్యాండ్ బాల్ పురుషుల్లో హైదరాబాద్, మహిళల్లో రంగారెడ్డి జట్లు విజేతలుగా నిలిచాయి. హాకీ మెన్స్లో సంగారెడ్డి ట్రోఫీ సొంతం చేసుకుంది.
ఆయా స్టేడియాల్లో విజేతలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, శాట్స్ చైర్మన్ ఈ. ఆంజనేయ గౌడ్ ట్రోఫీలు, సర్టిఫికెట్స్, ప్రైజ్మనీ అందజేశారు. సీఎం కప్ ద్వారా ఎంతో మంది పల్లె క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే నైఫుణ్యం ఉందని ఆంజనేయగౌడ్ అన్నారు. టోర్నీని విజయవంతం చేసిన క్రీడాకారులు, కోచ్లు, శాట్స్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.