ఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు  ప్రారంభమయ్యాయి. కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పాలన జరుగుతోంది. కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కటం ద్వారా కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను  ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. నిన్న కొంతమంది బాధ్యతలు స్వీకరించగా..మిగతా అధికారులు ఇవాళ బాధ్యతలు  స్వీకరించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో పండగ వాతావరణం నెలకొంది.

మేక తోలుకు రంగేసి పులి చర్మం పేరుతో విక్రయం