మీకు నేనున్నాను.. తుఫాన్ బాధితులకు సీఎం జగన్ భరోసా

మీకు నేనున్నాను.. తుఫాన్ బాధితులకు సీఎం జగన్ భరోసా

ఏపీ :  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. ఇటీవల తఫాన్ కారణంగా తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం సీఎం జగన్ తిరుపతిలో పర్యటించారు. హెలికాఫ్టర్  ఏరియల్ వ్యూలో తుఫాన్ నష్టంపై తిరుపతి జిల్లా కలెక్టర్ ను  వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోట మండలం విద్యానగర్ కు చేరుకున్న సీఎంకు అక్కడి సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 

విద్యానగర్ హెలీప్యాడ్ నుంచి నేరుగా బాలిరెడ్డిపాళెం,- గంగన్న పాళెం మధ్యలో స్వర్ణముఖి నదికి గండిపడిన ప్రాంతాలను పరిశీలించారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతుల ఆవేదనను స్వయంగా విని సీఎం చలించిపోయారు. అక్కడి నుంచి బాలిరెడ్డిపాళెం చేరుకుని తుఫాన్ బాధితులతో సమావేశమై మాట్లాడారు. అందరితో మాట్లాడి వారి సమస్యలు విని.. బాధ పడకండి.. మీకు నేనున్నా  అంటూ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం హెలీప్యాడ్ కు వెళుతూ కూడా మార్గమధ్యంలో పంట నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన అన్నదాతలను సీఎం జగన్ ఓదార్చి.. మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు సీఎం జగన్.