రేపు సిద్దిపేటకు ఇద్దరు సీఎంలు

రేపు  సిద్దిపేటకు ఇద్దరు సీఎంలు

రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా పర్యటించనున్నారు.   కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ లను పరిశిలించనున్నారు. పలు గ్రామాలతో పాటు  కూడవెల్లి వాగు చెక్ డ్యామ్ ను పరిశీలించనున్నారు. 

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతరించినప్పటి నుంచి భగవంత్ మాన్ కేసీఆర్ తో పలు సార్లు భేటీ అయ్యారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు కూడా భగవంత్ మాన్ హాజరయ్యారు. తెలంగాణలోని కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. పంజాబ్ లో కూడా  కంటి వెలుగు తరహాలో పథకం ప్రారంభిస్తామని అన్నారు.