సీఎస్ఓ కుమార్తె వివాహానికి కేసీఆర్

సీఎస్ఓ కుమార్తె వివాహానికి కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి సీఎస్ఓ చెరుకు వాసుదేవ రెడ్డి కుమార్తె వివాహం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. నూతన వధూవరులను కేసీఆర్ ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ తో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పెళ్లికి హాజరయ్యారు. మునుగోడులో భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లడానికి ముందే సీఎం కేసీఆర్ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు.