
ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. రాష్ట్రంలో వివాదాలు తలెత్తే సమయంలో తనేదో చేస్తున్నట్టు సుదీర్ఘ క్యాబినెట్ భేటీలు…సమీక్షలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆరేళ్ల పాలనలో మీరు చేపట్టిన ప్రాజెక్టుల పైన ఒక్క సారి కూడా ఎందుకు చర్చించలేదన్నారు. అసలు ఇంతవరకు ఎక్కడైనా మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించారా అని ప్రశ్నించారు పొన్నాల.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గోదావరిలో మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు మొదలు పెట్టామని తెలిపారు పొన్నాల లక్ష్మయ్య. అంతేకాదు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎల్లంపల్లి నుంచి చేపట్టిన ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించామని తేల్చిచెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేము ప్రారంభిస్తే…కేసీఆర్ దాన్ని నిర్లక్ష్యం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు వరకు చేపట్టిన ప్రాజెక్టు 2 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు.
గతేడాది SRSP, ఎల్లంపల్లి దగ్గర కు 108 TMCల నీళ్లు వస్తే, కేవలం 22TMCల నీళ్లు మాత్రమే వాడుకోగలిగామన్నారు. మిగిలిన 86 TMCల నీళ్లు వృధాగా వెళ్లి పోయాయని తెలిపారు. కనీసం నికర జలాలు వాడుకోలేని మీరు ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపి మేమే సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఏం చేశారని ప్రశ్నించారు పొన్నాల. దోపిడి కోణంలో తెచ్చిన 3TMCల టెండర్లన్నీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు పొన్నాల.శ్రీరాంసాగర్ నుండి LMD కి నీళ్లు పంపిస్తున్నాం అని కేసీఆర్ ఇప్పుడు చెబుతున్నారన్న ఆయన… కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని ఎప్పుడో చేసిందన్నారు. ప్రాజెక్టుల పైన తమతో.. ప్రభుత్వం చర్చకు రావాలన్నారు.
ఇక దేవాదుల ప్రాజెక్టులో కొత్తగా ఏ పనీ చేయలేదని…తట్టెడు మట్టికూడా కేసీఆర్ ప్రభుత్వం తీయలేదున్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.కేసీఆర్ తెలంగాణ కు పట్టిన మాయలపకీరంటూ తీవ్రంగా ఆరోపించారు. నవబర్ నుండి మే వరకు ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోసారో అధికారికంగా లెక్కలు బయట పెడతారా అంటూ సవాల్ చేశారు. కాళేశ్వరంలో ఉన్న 2TMCల నీళ్లను వాడుకోలేని మీరు… మరో TMC గురుంచి డబ్బులు ఖర్చు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు పొన్నాల.