- ప్రగతిభవన్లో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్
- హరీశ్ రావును అర్జెంట్గా పిలిపించుకున్న కేసీఆర్
- కేటీఆర్, వినోద్కుమార్, దామోదర్రావు కూడా హాజరు
- ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ భేటీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఎమర్జెన్సీ మీటింగ్నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్లానింగ్ బోర్డు వైస్చైర్మన్ వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ దామోదర్రావులతో పాటు ఇద్దరు ముగ్గురు సీనియర్ లీడర్లు మాత్రమే ఈ మీటింగ్ కు హాజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్న హరీశ్రావుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ అర్జెంట్గా ప్రగతిభవన్కు పిలిపించుకున్నట్టు తెలిసింది. చందనవెల్లిలో వెల్స్పన్ ఇండస్ట్రీ ఓపెనింగ్ పూర్తికాగానే కేటీఆర్నూ రమ్మన్నట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలుగానీ.. సీఎంవో అధికారులుగానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, ఎలక్షన్ ఏడాది కావడంతో ప్రభుత్వ ప్రధాన హామీలైన రైతుబీమా, సొంత జాగాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, దళితబంధు వంటి వాటిపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల పెర్ఫార్మెన్స్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉండొచ్చనేది సీఎం కేసీఆర్ నేతలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.