కొండగట్టు అంజన్న ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

కొండగట్టు అంజన్న ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

కొండగట్టు అంజన్న ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. హెలికాప్టర్ ద్వారా కొండగట్టుకు చేరుకున్న కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్ ఉన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు.

సీఎం కేసీఆర్ కొండగట్టు టూర్ సందర్భంగా పోలీసులు అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాత్రి నుంచే భక్తులకు దర్శనాలను బంద్ చేశారు. కొండ కింద షాపులను పోలీసులు మూసి వేయించారు. ఇటీవల కొండగట్టు ఆలయ అభివృద్ధి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.